News March 19, 2025

NRPT: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బలరాం అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్ వద్ద రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని అన్నారు. కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

Similar News

News September 18, 2025

మంచిర్యాల: 19న పలు రైళ్ల రద్దు

image

మందమర్రి-రామగుండం మధ్య 24 కి.మీ ట్రిపుల్ లైన్ రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనులు చేపట్టడంతో ఈనెల 19న పలు రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రామగిరి ఎక్స్‌ప్రెస్, కాజీపేట-బల్లార్షా ఎక్స్‌ప్రెస్ పూర్తిగా రద్దు కాగా, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-కాజీపేట వరకు, సింగరేణి ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ వరకు నడుస్తాయని తెలిపారు.

News September 18, 2025

పత్తి కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్

image

2025-26 పత్తి కొనుగోలు సీజన్‌పై సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్షించారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు జరపాలన్నారు. జిన్నింగ్ మిల్లుల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా, రైతులకు లాభదాయకంగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

News September 18, 2025

HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

image

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని సనత్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.