News February 4, 2025

NRPT: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News July 9, 2025

గిరి ప్రదక్షిణలో మాధవ స్వామి ఆలయానికి వెళ్తున్నారా..!

image

సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. భక్తులు ఇప్పటికే నడక ప్రారంభించారు. అయితే మాధవధారలో సింహాచలం కొండను అనుకోని ఉన్న మాధవస్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని గిరి యాత్ర కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గిరి ప్రదక్షిణ సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే మాధవస్వామి ఆలయం నుంచి మెట్ల మార్గాన సింహాచలానికి దారి కూడా ఉంది.

News July 9, 2025

NZB: GOOD NEWS.. వారికి 3 నెలల జీతాలు జమ

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 2,730 మల్టీపర్పస్ వర్కర్లకు 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 మాసాల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత GPల TGbPASS ఖాతాలలో జమ చేసిందని DPO శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. అందరూ ప్రత్యేకాధికారులు, పంచాయతి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధవహించి వెంటనే సంబంధిత మల్టీపర్పస్ వర్కర్ల వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు జమ చేయాలని ఆయన సూచించారు.

News July 9, 2025

నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

image

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు