News August 15, 2025

NRPT: మారణహోమానికి నేటికి 20 ఏళ్లు

image

నారాయణపేట పట్టణంలో నక్సలైట్లు జరిపిన మారణహోమానికి నేటికి 20 ఏళ్లు అయ్యాయి. నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఆనాటి ఉమ్మడి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితోపాటు ఆయన తనయుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డితోపాటు మరో 9 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమానికి పాల్పడ్డారు.

Similar News

News August 15, 2025

KNR: గ్రామాల్లో మళ్లీ VRO, VRAల వ్యవస్థ!

image

గ్రామపాలన అధికారులు(GPO)గా VRO, VRAలు మళ్లీ విధుల్లో చేరనున్నారు. వీరికి నిన్ననే నియామకపత్రాలు అందాల్సి ఉండగా వర్షాలతో కుదర్లేదు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలంటే VRO, VRAల అవసరం తప్పనిసరని గుర్తించిన ప్రభుత్వం వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఉమ్మడి KNRలో విధుల్లో చేరడానికి 2800మంది సుముఖత చూపగా KNR నుంచి 540మంది VRAలు, 300మంది VROలు కంబ్యాక్ అయ్యారు.

News August 15, 2025

అనకాపల్లి: జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హోం మంత్రి

image

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

News August 15, 2025

కరప: ఉప్పు సత్యాగ్రహానికి బీజం ఇక్కడే.!

image

కరప(మ)గురజనాపల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిగా నిలిచింది. జాతిపిత గాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించిన చోటు ఇదే. గాంధీ ఇక్కడికి వచ్చి ఉప్పు తీసుకుని వెళ్లారని పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాంతం నేటి రోజుల్లో కూడా ఉప్పు పంట పండిస్తుంది.79 ఏళ్లు గడిచినా,ఉప్పు పంట స్వాతంత్ర్య కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తుంది. గ్రామస్థులందరి గౌరవం స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలు సమాజంలో స్మరణీయంగా నిలుస్తున్నాయి.