News March 6, 2025
NRPT: మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని చెప్పారు. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 245 గ్రామాలు రెండు మున్సిపాలిటీలకు నీటి సరఫరా ఉండదని చెప్పారు.
Similar News
News March 7, 2025
మిర్యాలగూడ: యువకుడు ఆత్మహత్య.!

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువకుడు రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి బూడిద కలర్ టీ షర్ట్ ధరించి, నల్ల కలరు లోయర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు రూరల్ ఎస్ఐ లోకేష్ కుమార్ 8712670189కు తెలపాలని కోరారు.
News March 6, 2025
ఇఫ్లూ వీసీగా ప్రొఫెసర్ నాగరాజు

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్లర్గా ప్రొ.నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
News March 6, 2025
రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.