News February 27, 2025

NRPT: రైతు అవగాహన సదస్సు.. పాల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

image

నారాయణపేట పట్టణ శివారులోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంలో ఇవాళ మ.1 గంటలకు జరిగే రైతు అవగాహన సదస్సులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చతుర్విధ జల ప్రక్రియ ద్వారా పంటల సాగు అనే అంశం పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించనున్నారు.

Similar News

News November 6, 2025

గోరింటాకు ధరించడం వెనుక శాస్త్రీయత

image

పెళ్లిళ్లు, పండుగలప్పుడు ఆడపిల్లలు గోరింటాకు ధరించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఈ ఆచారం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకు అనేది ఓ ఔషధ మూలిక. పెళ్లి చేసుకున్నప్పుడు నూతన వధువులో సహజంగానే కాస్త భయం, ఆందోళన ఉంటుంది. ఆ ఫీలింగ్స్‌ను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఒంట్లో వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.

News November 6, 2025

నేడు బిహార్‌లో తొలి దశ ఎన్నికలు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో(NOV 6, 11) పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు 16 మంది మంత్రులు సహా మొత్తం 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. రెండు విడతల పోలింగ్ అయ్యాక NOV 14న ఓట్లు లెక్కించనున్నారు.

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.