News February 11, 2025
NRPT: ‘లోక్ అదాలత్ విజయవంతం చేయాలి’

మార్చ్ 8న నిర్వహించే లోక్ అదాలత్ను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం నారాయణపేట కోర్టు సమావేశ మందిరంలో పోలీస్, ఎక్సైజ్, కోర్టు సిబ్బందితో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. లోక్ అదాలత్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
Similar News
News December 14, 2025
ములుగు: PHASE-2లో పెరిగిన పోలింగ్ శాతం

జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగిన 3 మండలాలతో పోల్చితే రెండవ విడత పోలింగ్ జరిగిన 3 మండలాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. మొదటి విడత మండలాలైన గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 73.57% పోలింగ్ నమోదు కాగా, రెండో విడత మండలాలైనా వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో 81.53% పోలింగ్ నమోదయింది. పెరిగిన పోలింగ్ శాతం అధికార పార్టీ మద్దతు దారులకు అనుకూలమని విశ్లేషకులు అభిప్రాయం.
News December 14, 2025
యూదులే లక్ష్యంగా టెర్రర్ దాడి?

ఆస్ట్రేలియా బీచ్లో <<18561798>>కాల్పులు<<>> యూదులే లక్ష్యంగా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి 8 రోజులపాటు యూదులు ‘చనుకా(హనుక్కా)’ పండుగ జరుపుకుంటారు. రాత్రి పూట కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం సిడ్నీలోని బాండీ బీచ్కు చేరుకున్న 2 వేల మందిపై ఇద్దరు గన్మెన్లు ఫైరింగ్ జరిపారు. ఇది యూదులపై ఉగ్రవాదులు జరిపిన నీచమైన దాడి అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ మండిపడ్డారు.
News December 14, 2025
సూర్యాపేట: ఐదు ఓట్ల తేడాతో తొలి విజయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రెండో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హాజీ నాయక్ ఆదివారం గెలుపొందారు. కోదాడ మండలం కూచిపూడి తండా గ్రామపంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆయన ప్రత్యర్థిపై 5 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు చెప్పారు. తన గెలుపునకు కృషి చేసిన వార్డు ఓటర్లకు నూతన సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.


