News September 11, 2025

NRPT: వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

నిరంతరం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టలు, స్కూల్ భవనలు, వసతి గృహాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వరద నష్టంపై గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ అధికారులతో సమీక్ష చేశారు. మండలాల వారిగా నివేదికలు తయారు చేయాలన్నారు.

Similar News

News September 12, 2025

సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం (ఫొటోలో లెఫ్ట్)
1967: నటి అమల అక్కినేని జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (ఫొటోలో రైట్)
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
2024: తెలుగు గీత రచయిత గురుచరణ్ మరణం

News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 12, 2025

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

image

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <>వెబ్‌సైట్‌లో<<>> పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. లోకల్ విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో, నాన్ లోకల్ వారికి 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.