News March 28, 2024

NRPT: ‘సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేస్తే మిగతా డబ్బులు ఇస్తామని చెప్పే మాయ మాటలు నమ్మకండని చెప్పారు. అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ATM, OTP నంబర్లు ఇవ్వరదాని, ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News October 27, 2025

MBNR: కురుమూర్తి జాతర.. ప్రత్యేక బస్సులు

image

కురుమూర్తి జాతర సందర్భంగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు కురుమూర్తి జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News October 26, 2025

MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

image

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్‌లైన్‌లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

News October 25, 2025

బాలానగర్: పుట్టినరోజే.. చివరి రోజుగా మారింది..!

image

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.