News March 22, 2025
NRPT: 18 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రెండో రోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,635 మందికి ఇందులో 8 మంది విద్యార్థులు మినహాయింపు ఇవ్వగా 7,609 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ జరిపారు.
Similar News
News January 9, 2026
గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష: ఎస్పీ శబరీశ్

జిల్లాలో గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. గంజాయి సాగును అడ్డుకునేందుకు డ్రోన్ వ్యవస్థను వాడుతున్నామన్నారు. నరసింహులపేట మండలంలో వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని ప్రజలను కోరారు.
News January 9, 2026
బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News January 9, 2026
భూపాలపల్లి: మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం!

మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. పోటీకి సిద్ధమవుతున్న వివిధ పార్టీల నేతలు ఇప్పటికే వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈసారి ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో టికెట్ల వేటలో నేతలు తలమునకలయ్యారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు పోటీ పడుతుండటంతో అధిష్ఠానానికి ఎంపిక కత్తిమీద సాములా మారింది.


