News March 17, 2024

NRPT: ‘రెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయం’

image

పాలమూరు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని నారాయణపేట జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రధాని మోదీ విజయ సంకల్ప సభ దిగ్విజయం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో మునిగి పోయిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కానీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు.

Similar News

News April 3, 2025

‘మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి’

image

మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కుమారస్వామిని ఢిల్లీలో బుధవారం కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ కుమార్ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి బుధవారం ఆయన వినతిపత్రం ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

News April 3, 2025

గతేడాది మహబూబ్‌నగర్ FIRST.. ఈసారి వెనుకంజ..!

image

ఆస్తి పన్ను వసూళ్లను 100% అధిగమిస్తామని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. ప్రతిరోజు ముమ్మరంగా వసూళ్లు చేపట్టారు. మార్చి నెలాఖరు నాటికి 100%వసూళ్లే టార్గెట్‌గా చేసిన ప్రయత్నాలు 47% శాతానికి పరిమితమై గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ శాఖ ఈసారి 50% కూడా చేయలేకపోయింది. 

News April 3, 2025

మహబూబ్‌నగర్: ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్ 

image

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!