News February 13, 2025
NRPT: ఎంపికైన కొబ్బరి పూల కుండీల ప్రాజెక్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439718164_51771152-normal-WIFI.webp)
పర్యావరణ అనుకూలతకు తోటకు ఉపయోగించే సామాగ్రి, బయో డీగ్రేడబుల్ కొబ్బరి పూల కుండీలను TSWRS బాలుర దామరగిద్ద పాఠశాలకు చెందిన విద్యార్థి శివారెడ్డి తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపికైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 11వ జాతీయ స్థాయి ప్రదర్శన INSPIR-MANAK పోటీల్లో పాల్గొని ఘనత సాధించినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రం నుంచి 4 ఎంపికైవ వాటిలో ఇది ఒకటి అన్నారు.
Similar News
News February 13, 2025
BREAKING: తోటి సిబ్బందిపై CRPF జవాన్ ఘాతుకం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908589618-normal-WIFI.webp)
మణిపుర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
News February 13, 2025
రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739457499245_18661268-normal-WIFI.webp)
రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ నాయకులు రాజు గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని గురువారం మాల మహానాడు జాతీయ నాయకులు రాజు మాట్లాడుతూ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు సంఘాలు బందుకు పిలుపునిచ్చాయని, ఈ బంధును విజయవంతం చేయాలన్నారు.
News February 13, 2025
సికింద్రాబాద్.. ఈ భవనాలు ఇక కనిపించవు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459175969_81-normal-WIFI.webp)
సికింద్రాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే భవనాలు ఇవి. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికుల గుండెల్లో, సినిమాల్లో కనిపించిన ఈ రైల్వే స్టేషన్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఎన్నో ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా వీటి స్థానంలో ₹700crతో ఎయిర్పోర్టులా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాత భవనాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణికులు ఎమోషనల్ అవుతున్నారు.