News February 12, 2025
NRPT: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739277678804_51550452-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రిసైడింగ్, ఓ పి ఓ లను నియమించారు. త్వరలో వీటికి మాస్టర్ ట్రైనర్ ల తో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2025
కమలాపూర్లో అత్యధికం.. పరకాలలో అత్యల్పం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739335044811_18267524-normal-WIFI.webp)
హన్మకొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 129 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం కమలాపూర్ మండలంలో 90 పోలింగ్ కేంద్రాలు, శాయంపేటలో-61, ఆత్మకూరు-50, పరకాల-26, వేలేరు-29, దామెర-36, ఎల్కతుర్తి-59, నడికూడ-47, భీమదేవరపల్లి-69, హసన్పర్తి-40 ధర్మసాగర్-65, ఐనవోలు మండలంలో 59 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
News February 12, 2025
సంగారెడ్డి: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325606668_1243-normal-WIFI.webp)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఆసరా అందేనా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739322477656_51946525-normal-WIFI.webp)
ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కొత్త పింఛన్లపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హులైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత BRS ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఏళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తుందో.. లేదో అని ఇంకా స్పష్టత ఇవ్వలేదు.