News February 7, 2025
NRPT: ఐదుగురిపై కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850667858_51550452-normal-WIFI.webp)
సురక్షిత ప్రయాణానికి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్ఐ రేవతి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని పలు కోడెలలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 36 వాహనాలకు రూ.12,520 జరిమానాలు, పెండింగ్లో ఉన్న 61 వాహనాల జరిమానాలు వసూలు చేసినట్లు చెప్పారు. ఐదుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
DON’T MISS.. నెలకు రూ.15,000 స్టైఫండ్తో శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738870056095_695-normal-WIFI.webp)
బీటెక్, BE, BSc Engg, ఎంటెక్, MSc, MBA, MA విద్యార్థులకు IIT మద్రాస్ శుభవార్త చెప్పింది. వారు నైపుణ్యాలను పెంచుకునేందుకు 2 నెలలపాటు(మే 19 నుంచి జులై 18 వరకు) సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి <
News February 7, 2025
శ్రేయస్ అయ్యర్ ఆటతో భారత్ గెలిచింది: జహీర్ ఖాన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738912695687_1045-normal-WIFI.webp)
ఇంగ్లండ్తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను మాజీ పేసర్ జహీర్ ఖాన్ కొనియాడారు. ‘శ్రేయస్ ఆట చాలా చూడముచ్చటగా అనిపించింది. రెండు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్ బ్యాటింగ్కు వచ్చారు. మరో వికెట్ పడి ఉంటే ఛేజింగ్ ఇబ్బంది అయ్యేదే. ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి బంతి ఎలా గింగిరాలు తిరిగిందో చూశాం. కానీ తన దూకుడైన ఆటతో అయ్యర్ ఛేదనను సులువు చేసేశారు’ అని ప్రశంసించారు.
News February 7, 2025
సంగారెడ్డి: సర్వే డబ్బుల కోసం ఎదురుచూపులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738910786103_52434823-normal-WIFI.webp)
జిల్లాలో నిర్వహించిన సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యుమరేటర్లకు డబ్బులు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సర్వే పూర్తై రెండు నెలలు అయినా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఎన్యుమరేటర్లకు త్వరగా డబ్బులు చెల్లించేలా చూడాలని వారు కోరుతున్నారు.