News March 15, 2025

NRPT: జిల్లాకు మంచి పేరు తేవాలి: డీఈవో

image

నారాయణపేట మండలం జాజాపూర్ మండల పరిషత్ పాఠశాలలో శనివారం డీఈవో గోవిందరాజు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తరగతుల శిక్షణకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. శిక్షణను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 16, 2025

ఊట్కూర్: బాల్య వివాహ ప్రయత్నం అడ్డగింత

image

ఊట్కూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక (17)కు బాల్య వివాహం జరిపించాలని యత్నించగా అధికారులు శనివారం అడ్డుకున్నారు. సోషల్ వర్కర్ శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను మరో గ్రామానికి చెందిన యువకుడు (23)తో బాల్య వివాహం జరిపించడానికి వారి కుటుంబ సభ్యులు యత్నించగా బాలల సంరక్షణ అధికారులు అశ్విని, శ్రవణ్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.

News March 16, 2025

గద్వాలలో వ్యక్తి మృతి

image

ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అలంపూర్ చౌరస్తా నుంచి చెన్నిపాడు వైపునకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలంపూర్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.

News March 16, 2025

అమెరికాలో తుపాను ధాటికి 16మంది మృతి

image

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకూ 16మంది మృతి చెందారు. మిస్సోరీ రాష్ట్రంలో 10మంది, అర్కన్నాస్‌లో ముగ్గురు మరణించగా వివిధ ప్రాంతాలలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. బలమైన గాలుల ధాటికి భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో కార్చిచ్చులు చెలరేగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో రాష్ట్రాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.

error: Content is protected !!