News March 5, 2025
NRPT: బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లె లో వెలసిన శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు (బావోజి) బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఆలయ ఆవరణలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఏర్పాట్లపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 11 నుంచి 14 వరకు జరిగే ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయంలో బావోజీని దర్శనం చేసుకొని పూజలు చేశారు.
Similar News
News December 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 97 సమాధానం

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
సమాధానం: కొండగట్టు అంజన్న స్వామి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 15, 2025
రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాకు ఏడో స్థానం

ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ-ఆఫీస్ విధానంలో రోజుకు 9 గంటల్లో జిల్లాలో 1,363 ఫైల్స్ పరిశీలన, పరిష్కారంపై రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచానన్నారు. దీంతో జిల్లా అధికారులు కలెక్టర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖజానా శాఖలో ఈ-ఫైల్స్ ఒక్కటి కూడా నమోదు కాకపోవడంపై ఆరా తీశారు. నిర్లిప్తంగా ఉండరాదని, కచ్చితంగా ఈ-ఫైలింగ్ చేపట్టాలని ఆదేశించారు.
News December 15, 2025
NTR: సూట్లు వేసి కోట్లలో కుంభకోణం..!

విస్సన్నపేట కేంద్రంగా రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చదువు రానివారికి సూట్లు వేసి, ఫోటోలను డిజిటల్గా మార్చి డైరెక్టర్లుగా చూపించి ప్రజలను మోసం చేశారు. ఈ విషయం తెలుసుకుని బాధితులు విస్తుపోతున్నారు. డైరెక్టర్ల నుంచి రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.


