News February 2, 2025
NRPT: సబ్సిడీపై మామిడి రైతులకు ఫ్రూట్స్ కవర్లు

మామిడి తోటలు సాగు చేసే రైతులకు సబ్సిడీపై ఫ్రూట్స్ కవర్లు అందిస్తామని నారాయణపేట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. చెట్టుపై మామిడి కాయలను కవర్లు కడితే అధిక దిగుబడి, కాయ మొత్తానికి ఒకే రంగు, ఎలాంటి మచ్చలు ఉండవని చెప్పారు. కాయలకు అధిక ధర వస్తుందని అన్నారు. ఎకరాకు 8 వెల కవర్లను 50 శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. కవర్లు కావాల్సిన రైతులు 8977714457 నంబర్కు సంప్రదించాలని అన్నారు.
Similar News
News March 10, 2025
ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్సైట్: https://edcet.tgche.ac.in
News March 10, 2025
సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
News March 10, 2025
MHBD: డోర్నకల్కు యంగ్ ఇండియా గురుకులం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్కు రూ.200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.