News December 16, 2024

చైనాకు NSA అజిత్ దోవల్!

image

NSA అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటిస్తారని తెలిసింది. ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని సమాచారం. చివరిసారిగా 2020కి ముందు ఢిల్లీలో ఈ చర్చలు జరగడం గమనార్హం. ఆ తర్వాత గల్వాన్ వివాదం చెలరేగడంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుతం సరిహద్దుల వద్ద యథాతథ స్థితి నెలకొనడం, సైనికుల ఉపసంహరణ పూర్తవ్వడంతో మళ్లీ మొదలయ్యాయి. బంగ్లా, మయన్మార్‌ అనిశ్చితి నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా మారాయి.

Similar News

News October 22, 2025

పాక్ ఘోర ఓటమి.. WWC నుంచి ఎలిమినేట్

image

WWCలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 150 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా మ్యాచును 40 ఓవర్లకు కుదించగా సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఛేదనలోనూ వర్షం కురవడంతో పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా అంపైర్లు నిర్దేశించారు. ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించని పాక్ 20 ఓవర్లలో 83 పరుగులే చేసింది. ఈ ఓటమితో WWC నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయింది.

News October 22, 2025

వైట్‌హౌస్‌లోకి బుల్డోజర్లు.. కారణమిదే!

image

వరుస వివాదాలు చుట్టుముడుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైట్‌హౌస్‌లోని ఈస్ట్ వింగ్‌లో కొంతభాగాన్ని బుల్డోజర్లతో కూలగొట్టిస్తున్నారు. తన బాల్‌రూమ్ ప్రాజెక్టు ($250M) కోసం ఆయన ఇలా చేస్తున్నారు. కూల్చివేతల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అధికారిక విందులు, సమావేశాలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగించే పెద్ద గదినే బాల్‌రూమ్/బాల్‌హాల్ అంటారు.

News October 22, 2025

TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

image

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.