News March 26, 2025
NTR: అన్న క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్

విజయవాడ వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విజయవాడ సింగ్నగర్ టిక్కల్ రోడ్డు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన అన్న క్యాంటీన్లో భోజన వసతులను వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
Similar News
News October 28, 2025
CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
News October 28, 2025
134 మంది గర్భిణులు ఆసుపత్రికి తరలింపు: కలెక్టర్

మొంథా తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులు, నిరాశ్రయుల రక్షణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి సూచనల మేరకు 134 మంది గర్భిణులను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 5,407 మందిని 119 పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని వసతులు కల్పించామన్నారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
News October 28, 2025
కోనసీమలో విషాదం.. చెట్టు కూలి మహిళ మృతి

తుఫాను ప్రభావంతో కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలంలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాకనపాలెంలోని ఓ ఇంటి ఆవరణలో తాటిచెట్టు పడిపోవడంతో గూడపల్లి వీరవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


