News April 12, 2025
NTR: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థిని ప్రతిభ

రాష్ట్ర వ్యాప్తంగా నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో గంపలగూడెంలోని ఏపీ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థిని అపరంజి ఉత్తమ మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470కి 452 మార్కులతో గంపలగూడెం మండలంలోని ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానంలో నిలిచింది. అపరంజి ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News April 20, 2025
జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
News April 20, 2025
ఆత్మకూరు: ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్

ఆత్మకూరులో కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో గర్భంలోనే చనిపోయిన శిశువు తల, మొండెం వేరుచేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సర్జరీ చేసే చేసే క్రమంలో అనస్తీషియాను అర్హత లేని వ్యక్తులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా క్లినిక్ను సీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
News April 20, 2025
తాండూరులో సోమవారం ప్రజావాణి

తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని సిబ్బంది నవీన్ తెలిపారు. గత వారం హాలిడే సందర్భంగా ప్రజావాణి రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో గతవారం కొందరు వ్యక్తులు హాలిడే అని తెలియక ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినట్టు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు.