News February 26, 2025

NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

image

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.

Similar News

News February 26, 2025

క్రిమినల్ పొలిటీషియన్స్‌పై ఆరేళ్ల నిషేధం చాలు: కేంద్రం

image

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినవారు ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్ల నిషేధం చాలని కేంద్రం అభిప్రాయపడింది. జీవితకాలం అనర్హత వేటు వేయడం కఠినమని సుప్రీంకోర్టుకు తెలిపింది. అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌పై స్పందించింది. ‘జీవితకాల నిషేధం సముచితం అవునో, కాదోనన్న ప్రశ్న పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దానిని సభ నిర్ణయిస్తుంది. ప్రస్తుత శిక్షాకాలం సరైందే. నేర నియంత్రణకు సరిపోతుంది’ అని పేర్కొంది.

News February 26, 2025

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి పార్ట్‌నర్: CM రేవంత్

image

TG: KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్‌నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై మాట్లాడుతూ ‘పదేళ్ల నుంచి పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 30కి.మీ మేర టన్నెల్ పూర్తయింది. తర్వాత తనకు లాభాలు రావడం లేదని KCR పనులను ఆపేశారు’ అని పేర్కొన్నారు.

News February 26, 2025

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో అనుమతులు తప్పనిసరి: CP

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సీపీ డాక్టర్ బి. అనురాధ సూచించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 14 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, కావున ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!