News February 26, 2025
NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.
Similar News
News March 27, 2025
సంగారెడ్డి: స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని వినతి

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సంగారెడ్డిలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో వేతనాలు విడుదల చేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.
News March 27, 2025
బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టిన దుబాయ్ ప్రిన్స్

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్, షేఖా షేఖా బింట్ సయీద్ బిన్ థాని అల్ మఖ్తూమ్ దంపతులు తమ నాలుగో బిడ్డకు ‘హింద్’ అని పేరుపెట్టడం చర్చకు దారితీసింది. ఆ పదానికి అర్థం ‘సమృద్ధి’ అని తెలిసింది. శిశువుకు అమ్మమ్మ ‘షేఖా హింద్ బింట్ మఖ్తూమ్ బిన్ జుమా అల్ మక్తూమ్’ పేరునే పెట్టడం విశేషం. ‘దేవుడి ఆశీర్వాదంతో మాకు పుట్టిన నాలుగో బిడ్డకు హింద్గా నామకరణం చేశాం’ అని ప్రిన్స్ తెలిపారు.
News March 27, 2025
కొత్తగూడెంలో నిరుద్యోగులకు GOODNEWS.. రేపే!

జిల్లాలో నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ గుడ్ న్యూస్ చెప్పారు. పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండి SSC, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 550 ఉద్యోగాలకు గాను ముఖాముఖి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.