News February 18, 2025
NTR: గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

మైలవరం, జగ్గయ్యపేటలోని జ్యోతిబాఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాదిలో 5వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశపరీక్ష నిర్వహించి మైలవరంలో 80, జగ్గయ్యపేటలో 40 సీట్లు భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 15 లోపు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్సైట్లో చూడాలని అధికారులు సూచించారు.
Similar News
News October 26, 2025
జూబ్లీ బైపోల్ ఆ ముగ్గురికి అగ్నిపరీక్ష

జూబ్లీ బైపోల్ రేవంత్, KTR, రాంచందర్రావుకు ప్రతిష్ఠ పోరైంది. గెలుపు, ఓటమి పనితీరుకు తీర్పు కానుంది. గెలిస్తే రేవంత్రెడ్డి పాలనకు రెఫరెండమ్గా భావించొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ KTR చూస్తున్నారు. BRS గెలిస్తే సీటీలో ఆయన ఇమేజ్ బలపడి, ఆయన నాయకత్వానికి ఈ తీర్పు సూచికవుతుంది. BJP TG చీఫ్ రాంచందర్రావుకు ఇదే తొలిఎలక్షన్. బోణి కొడితే ఆయన నాయకత్వంపై అందరిలో స్పష్టత వస్తుంది.
News October 26, 2025
జూబ్లీ బైపోల్ ఆ ముగ్గురికి అగ్నిపరీక్ష

జూబ్లీ బైపోల్ రేవంత్, KTR, రాంచందర్రావుకు ప్రతిష్ఠ పోరైంది. గెలుపు, ఓటమి పనితీరుకు తీర్పు కానుంది. గెలిస్తే రేవంత్రెడ్డి పాలనకు రెఫరెండమ్గా భావించొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ KTR చూస్తున్నారు. BRS గెలిస్తే సీటీలో ఆయన ఇమేజ్ బలపడి, ఆయన నాయకత్వానికి ఈ తీర్పు సూచికవుతుంది. BJP TG చీఫ్ రాంచందర్రావుకు ఇదే తొలిఎలక్షన్. బోణి కొడితే ఆయన నాయకత్వంపై అందరిలో స్పష్టత వస్తుంది.
News October 26, 2025
అనకాపల్లి: ‘కాలేజీలకు 3రోజులు సెలవులు’

మొంథా తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈనెల 27 నుంచి 29 వరకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా వచ్చే మూడు రోజులు <<18107873>>పాఠశాలలకు సెలవులు<<>> ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


