News February 18, 2025
NTR: గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

మైలవరం, జగ్గయ్యపేటలోని జ్యోతిబాఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాదిలో 5వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశపరీక్ష నిర్వహించి మైలవరంలో 80, జగ్గయ్యపేటలో 40 సీట్లు భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 15 లోపు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్సైట్లో చూడాలని అధికారులు సూచించారు.
Similar News
News April 17, 2026
SHOCKING: ‘జైలర్-2’ కీలక సీన్ లీక్!

మొన్న విజయ్ <<19615293>>‘జననాయగన్’<<>>.. నేడు రజినీకాంత్ ‘జైలర్-2’. పైరసీ భూతం కోలీవుడ్ పెద్ద సినిమాలను వెంటాడుతోంది. నెల్సన్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘జైలర్-2’ షూటింగ్ స్పాట్లో తీసిన వీడియో క్లిప్ లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ సీరియస్ అయింది. లీకైన దృశ్యాలను ఎవరూ షేర్ చేయవద్దని, అలా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సన్ పిక్చర్స్ హెచ్చరించింది.
News April 17, 2026
ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
News April 17, 2026
హుండీలో వేసిన నాగ పడగలను ఏమి చేస్తారంటే..!

రాహుకేతు పూజల అనంతరం వెండి నాగ పడగలను భక్తుల చేతులతోనే హుండీలో సమర్పిస్తారు. అనంతరం హుండీలో నుంచి సేకరించిన నాగ పండుగలను చెన్నైకు తరలిస్తారు. అక్కడ ఈ వెండి నాగ పడగలను కరిగించి, తిరిగి నూతన నాగ పడగలు తయారు చేసి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి తరలిస్తారు. మేకింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ మినహా… ఆలయ దేవస్థానం వద్ద ఉన్న వెండితోనే రొటేషన్ అవుతూ వస్తుంది.


