News February 24, 2025

NTR: జిల్లాలో జరిగిన చారిత్రక ఘట్టంపై గ్రూప్-2 పరీక్షలో ప్రశ్న

image

ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలోని 1వ పేపర్‌లో విజయవాడలో జరిగిన చారిత్రక ఘట్టంపై APPSC అభ్యర్థులను ప్రశ్న అడిగింది. విజయవాడలో “నెడుంబ వసతి” అనే జైన ఆలయాన్ని నిర్మించిన మహిళ అయ్యన మహాదేవి కాగా ఆమె ఎవరి పట్టమహిషి అనే ప్రశ్నను APPSC అభ్యర్థులను అడిగింది. కాగా సాయంత్రం వెలువడిన ప్రాథమిక కీలో ఈ ప్రశ్నకు సమాధానం “కుబ్జ విష్ణువర్ధునుడిగా” APPSC ప్రకటించింది.

Similar News

News February 24, 2025

ఓటీటీలోకి కొత్త సినిమా

image

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.

News February 24, 2025

పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే: అంబటి

image

AP: ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే YS జగన్ <<15563014>>జర్మనీకి వెళ్లాలన్న<<>> Dy.CM పవన్‌కు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే’ అని సెటైర్ వేశారు. గోవాలో 40 స్థానాలుండగా 21 మ్యాజిక్ ఫిగర్. ఏపీలో 21 స్థానాలను జనసేన గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎప్పటికీ సీఎం కాలేడనే అర్థంలో ఆయన ట్వీట్ చేశారు.

News February 24, 2025

కరీంనగర్ : జర్నలిస్టుల సమస్యలపై కలెక్టరకు వినతి

image

ఈ రోజు కరీంనగర్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టుల కార్యదర్శి కుడి తాడి బాపురావు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం సమర్పించారు. బాపురావు మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు హుజురాబాద్‌లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్ తదితర సౌకర్యం  కల్పించాలని విన్నవించినట్లు చెప్పారు.

error: Content is protected !!