News February 24, 2025
NTR: జిల్లాలో జరిగిన చారిత్రక ఘట్టంపై గ్రూప్-2 పరీక్షలో ప్రశ్న

ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలోని 1వ పేపర్లో విజయవాడలో జరిగిన చారిత్రక ఘట్టంపై APPSC అభ్యర్థులను ప్రశ్న అడిగింది. విజయవాడలో “నెడుంబ వసతి” అనే జైన ఆలయాన్ని నిర్మించిన మహిళ అయ్యన మహాదేవి కాగా ఆమె ఎవరి పట్టమహిషి అనే ప్రశ్నను APPSC అభ్యర్థులను అడిగింది. కాగా సాయంత్రం వెలువడిన ప్రాథమిక కీలో ఈ ప్రశ్నకు సమాధానం “కుబ్జ విష్ణువర్ధునుడిగా” APPSC ప్రకటించింది.
Similar News
News November 28, 2025
4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిరసన తెలిపారు.
News November 28, 2025
వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
News November 28, 2025
బాపట్ల: పరీక్షల షెడ్యూల్ రద్దు..!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షల షెడ్యూల్ను రద్దు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.


