News April 8, 2025
NTR: పవన్ కళ్యాణ్పై పోతిన మహేశ్ ఫైర్

పెందుర్తిలో DCM పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయలేకపోయారని వైసీపీ నేత పోతిన మహేశ్ సోమవారం ట్వీట్ చేశారు. మాటలు, సూక్తులు చెప్పడం కాదని ఆచరణలో చేసి చూపించాలని మహేశ్ పవన్పై ఫైరయ్యారు. ఈ ఘటనకి బాధ్యత మీది కాదా? తప్పు చేసేది ఒకరు శిక్షపడేది మరొకరికా? ఇదెక్కడి న్యాయం? అంటూ మహేశ్..DCM పవన్ను ప్రశ్నించారు.
Similar News
News October 23, 2025
మహిళా శక్తి.. ప్రశంసించాల్సిందే!

నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సజావుగా నడుస్తోంది. ఈ క్రమంలో ఇంటి పని, ఆఫీస్ ఒత్తిడి, కుటుంబాన్ని చక్కదిద్దే బహుముఖ పాత్రను పోషిస్తున్న మహిళల కృషి అసాధారణమైనది. ఆఫీసు పనితో పాటు ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అంత తేలిక కాదు. ఈ సవాళ్లు అలసట కలిగించినా, తన ప్రేమ, బలం, దృఢ సంకల్పంతో ఆమె అన్నిటినీ సమన్వయం చేస్తోంది. నిజంగా, మహిళే ఆ కుటుంబానికి గుండెకాయ!
News October 23, 2025
సంగారెడ్డి: పఠనాసక్తిని పెంచేందుకే రూమ్ టు రీడ్: డీఈఓ

విద్యార్థులు పఠనాసక్తిని పెంచేందుకే రూమ్ టు రీడ్ కార్యక్రమం అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలో మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఎంఓ బాలయ్య, రూమ్ టు రీడ్ సభ్యులు పాల్గొన్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెసోళ్లను నిలదీయండి: KCR

పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తోన్న KCR కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారో కాంగ్రెసోళ్లను జూబ్లీహిల్స్ ప్రజలు నిలదీయాలని మాజీ CM KCR పిలుపునిచ్చారు. యాదవులకు అందిస్తోన్న గొర్రెల పంపిణీ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీ ఎందుకు దిగమింగారో ఓటు అడిగేందుకు ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని అడగాలని KCR కోరారు. పథకాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.