News April 8, 2025

NTR: పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్

image

పెందుర్తిలో DCM పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా 30 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయలేకపోయారని వైసీపీ నేత పోతిన మహేశ్ సోమవారం ట్వీట్ చేశారు. మాటలు, సూక్తులు చెప్పడం కాదని ఆచరణలో చేసి చూపించాలని మహేశ్ పవన్‌పై ఫైరయ్యారు. ఈ ఘటనకి బాధ్యత మీది కాదా? తప్పు చేసేది ఒకరు శిక్షపడేది మరొకరికా? ఇదెక్కడి న్యాయం? అంటూ మహేశ్..DCM పవన్‌ను ప్రశ్నించారు.

Similar News

News November 27, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,268 పోలింగ్ కేంద్రాలు

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం 260 పంచాయతీల్లో 2,268 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాలలో 85, 2వ దశ ఎన్నికలు నిర్వహించే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 88, 3వ విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News November 27, 2025

పల్నాడు బీజేపీలో గందరగోళం..!

image

బీజేపీలో నియోజకవర్గ కన్వీనర్లను రద్దు చేస్తూ గతంలోనే పార్టీ పెద్దలు ఆదేశాలిచ్చారు. అయితే బుధవారం గురజాలలో కొందరు నేతలు సమావేశమై తాము సత్తెనపల్లి, గురజాల సహా ఐదు నియోజకవర్గాలకు కన్వీనర్లమంటూ ప్రకటించుకున్నారు. దీనిపై పల్నాడు జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ తీవ్రంగా ఖండించారు. పార్టీలో కన్వీనర్‌ పదవులు లేవని స్పష్టం చేశారు.

News November 27, 2025

క్వాలిఫైయింగ్ పరీక్షలను పర్యవేక్షించిన ఎస్పీ స్నేహ మెహ్రా

image

ఏఆర్‌ఎస్‌ఐలకు ఆర్‌ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించేందుకు నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ క్వాలిఫైయింగ్ పరీక్షలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా గురువారం ఉదయం పర్యవేక్షించారు. మల్టీ జోన్-II పరిధిలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షల్లో భాగంగా ఏఆర్‌ఎస్‌ఐలకు సంబంధించిన శారీరక సామర్థ్య కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరుపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.