News April 16, 2025

NTR: మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్

image

జిల్లాలో పీ-4 స‌ర్వే ఆధారంగా గుర్తించిన ప్ర‌తి కుటుంబానికి ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్నట్లు మంగళవారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. కుటుంబాల నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌డంలో జిల్లాస్థాయి అధికారులు క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో కలిసి స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో కలెక్టర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. 

Similar News

News December 12, 2025

చిన్నస్వామిలో IPL మ్యాచ్‌లకు లైన్ క్లియర్!

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్‌లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్‌ డీకున్హా కమిషన్‌ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్‌ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.

News December 12, 2025

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు

News December 12, 2025

ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

image

దేశంలో ఫార్మా పీఎస్‌యూ (పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్‌యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.