News April 16, 2025

NTR: మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్

image

జిల్లాలో పీ-4 స‌ర్వే ఆధారంగా గుర్తించిన ప్ర‌తి కుటుంబానికి ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్నట్లు మంగళవారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. కుటుంబాల నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌డంలో జిల్లాస్థాయి అధికారులు క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో కలిసి స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో కలెక్టర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. 

Similar News

News November 15, 2025

గద్వాల్: స్థానిక ఎన్నికలకు ఊపందుకోనున్న వేగం

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వేగం పుంజుకోనుంది. ఈ నెల 17న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా గద్వాల్ జిల్లాలో 13 జడ్పీటీసీ 13 ఎంపీపీ, 142 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

News November 15, 2025

కామారెడ్డి: ‘ఆహార భద్రత నిబంధనలు పాటించండి’

image

కామారెడ్డిలో ఆహార భద్రత నిబంధనల అమలుపై ఆహార భద్రత నియోజిత అధికారి శిరీష శనివారం పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు దుకాణాల్లో ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటించని దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా లేబులింగ్ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News November 15, 2025

KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.