News April 16, 2025

NTR: మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్

image

జిల్లాలో పీ-4 స‌ర్వే ఆధారంగా గుర్తించిన ప్ర‌తి కుటుంబానికి ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్నట్లు మంగళవారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. కుటుంబాల నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌డంలో జిల్లాస్థాయి అధికారులు క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో కలిసి స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో కలెక్టర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి మాట్లాడారు. 

Similar News

News December 1, 2025

రుద్రంగిలో MLA ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

News December 1, 2025

పాలమూరు: పంచాయతీ ఎన్నికలు.. వారికి ప్రమాదం!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా.. బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

News December 1, 2025

ADB: గొంతు ఎత్తాలి.. నిధులు తేవాలి

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలైనా గోడం నగేశ్ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాసర ఆలయ అభివృద్ధి, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, సిర్పూర్, మంచిర్యాల రైల్వే లైన్‌లో కొత్త రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్లో అభివృద్ధిపై చర్చించాలి. పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరాలి.