News February 2, 2025

NTR: యూజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అక్టోబర్, నవంబర్ 2024లో నిర్వహించిన యూజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 13లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,490 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ శనివారం తెలిపారు.

Similar News

News January 3, 2026

BSFలో 549 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>BSF<<>> స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్ (GD)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ పాసై, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న వారు అర్హులు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/

News January 3, 2026

పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. ఖాళీలు ఇలా.!

image

జిల్లాలోని కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 100 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. టైప్-4లో ఖాళీలు ఇలా ఉన్నాయి.
వార్డెన్: 6.
పార్ట్ టైమ్ టీచర్: 7.
చౌకీదార్: 6.
హెడ్ కుక్: 5.
అసిస్టెంట్ కుక్: 14.
టైప్-3 మొత్తం: 62.
టైప్-4 మొత్తం: 38.

News January 3, 2026

GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.