News March 11, 2025

NTR: రద్దైన పరీక్ష నిర్వహించేది ఎప్పుడంటే..!

image

పేపర్ లీకైన కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7న రద్దైన బీఈడీ- పర్స్‌పెక్టివ్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పేపర్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకైన కారణంగా మంత్రి లోకేశ్ ఆదేశాలతో ANU అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అటు లీకేజీకి కారణమైన నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 16, 2025

రాజకీయ రౌడీలు తయారయ్యారు: చంద్రబాబు

image

రాజకీయాల ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని <<18584131>>CM<<>> CBN అన్నారు. ‘నాకూ కొన్ని గుణపాఠాలున్నాయి. నమ్మి మోసపోయా. 2019లో YS వివేకా గుండెపోటుతో చనిపోయారని ఉదయం చెప్పారు. తర్వాతి రోజు నారాసుర రక్తచరిత్ర అని నా చేతిలో కత్తిపెట్టి పేపర్లో వేశారు. నేరస్థులు తప్పించుకుని CMపైనే నేరం వేయాలని చూశారు. జనం నమ్మి వారికి ఓటేశారు. నేను ఓడిపోయా. దోషుల్ని అప్పుడే అరెస్టు చేసుంటే గెలిచేవాడిని’ అని అన్నారు.

News December 16, 2025

BREAKING: సూర్యాపేటలో స్కూల్ బస్సుకు యాక్సిడెంట్

image

సూర్యాపేటలో ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని అంజనాపూరీ వద్ద సిద్ధార్థ స్కూల్ బస్సు అదుపుతప్పి ఓ వ్యక్తిని, చెట్టును ఢీకొట్టింది. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రైమరీ విద్యార్థులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 16, 2025

విశాఖ: సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

image

పూసపాటిరేగకు చెందిన వాసుపల్లి రాములు (55) సముద్రంలో గల్లంతయ్యాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి శుక్రవారం బోటులో వేటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి తీరానికి 70 మైళ్ల దూరంలో ఆయన ప్రమాదవశాత్తు బోటుపై నుంచి సముద్రంలో జారిపడ్డాడు. సహచర సిబ్బంది గాలించినా ఆచూకీ లభించలేదని, మంగళవారం సాయంత్రం ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసినట్లు పోర్ట్ సీఐ రమేశ్ తెలిపారు.