News March 11, 2025

NTR: రద్దైన పరీక్ష నిర్వహించేది ఎప్పుడంటే..!

image

పేపర్ లీకైన కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7న రద్దైన బీఈడీ- పర్స్‌పెక్టివ్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పేపర్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకైన కారణంగా మంత్రి లోకేశ్ ఆదేశాలతో ANU అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అటు లీకేజీకి కారణమైన నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 3, 2025

అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

image

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.

News December 3, 2025

మోరంపూడి ఫ్లైఓవర్‌ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

మోరంపూడి ఫ్లైఓవర్‌ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

News December 3, 2025

ADB: CM సభ.. కలెక్టర్, SP నిరంతర పర్యవేక్షణ

image

ఆదిలాబాద్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అప్రమత్తయ్యారు. సీఎం సభ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.