News March 11, 2025

NTR: రద్దైన పరీక్ష నిర్వహించేది ఎప్పుడంటే..!

image

పేపర్ లీకైన కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7న రద్దైన బీఈడీ- పర్స్‌పెక్టివ్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పేపర్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకైన కారణంగా మంత్రి లోకేశ్ ఆదేశాలతో ANU అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అటు లీకేజీకి కారణమైన నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News November 24, 2025

భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

image

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.

News November 24, 2025

వేములవాడలో ప్రచార రథం వద్ద కొనసాగుతున్న దర్శనాలు

image

వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయం ముందు భాగంలోని ప్రచార రథం వద్ద భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య కైంకర్యాలను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించి తరిస్తున్నారు.

News November 24, 2025

శబరిమల యాత్రకు మంథని డిపో నుంచి ప్రత్యేక బస్సు

image

శబరిమల భక్తుల కోసం మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు DM శ్రావణ్‌కుమార్ తెలిపారు. వెళ్లేటప్పుడు మంథని-హైదరాబాద్-శ్రీశైలం-మహానంది-కాణిపాకం-పంబ, తిరుగు ప్రయాణంలో మదురై-రామేశ్వరం-తిరుపతి మార్గంగా బస్సు నడుస్తుంది. చార్జీ ₹6900. బార్డర్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజులు ప్రయాణికులే చెల్లించాలి. 35 సీట్లు బుక్ చేసిన గ్రూపులకు 5మందికి ఉచిత ప్రయాణం. బుకింగ్‌కు: 9959225923, 9948671514