News April 3, 2025
NTR: రాజధాని అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం

సింగపూర్ బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. ఈ బృందానికి సిఆర్డిఏ అధికారులు రాజధానిలో చేపట్టిన పలు భవన నిర్మాణాల గురించి వివరించారు. ఉండవల్లి వద్ద వరద నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికలను సిఆర్డిఏ అధికారులు వివరించారు. అనంతరం సీడ్ యాక్సిస్ రహదారి, మంత్రులు, IAS అధికారుల బంగ్లాల పనులలో పురోగతిని సింగపూర్ ప్రతినిధులు పరిశీలించారు.
Similar News
News December 8, 2025
తిరుచానూరు: అర్చకులకు తెలిసే జరిగిందా…?

తిరుచానూరు ఆలయంలో అనాధికారిక వ్కక్తుల్లో ఒక్కరు అవినాష్. ఆలయంలోని అర్చకులకు తెలిసే అతను ఆలయంలోకి వస్తున్నాడని సమాచారం. ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాల వద్ద కనిపించే ఈ వ్యక్తి ఎవరు అని ఇతరులు ప్రశ్నించకపోవడంతో అర్చకులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.
News December 8, 2025
WGL: UDISE వర్క్ షాప్లో పాల్గొన్న విద్యాశాఖ సిబ్బంది

UDISE( యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) పై హైదరాబాదులోని గోల్డెన్ జూబ్లీ బ్లాకులో సోమవారం వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యుడైస్ పోర్టల్ లో ఖచ్చితత్వమైన విద్యార్థుల సమాచారాన్ని నమోదు చేయడం పై విద్యాశాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.


