News April 3, 2025

NTR: రాజధాని అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం

image

సింగపూర్ బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. ఈ బృందానికి సిఆర్డిఏ అధికారులు రాజధానిలో చేపట్టిన పలు భవన నిర్మాణాల గురించి వివరించారు. ఉండవల్లి వద్ద వరద నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికలను సిఆర్డిఏ అధికారులు వివరించారు. అనంతరం సీడ్ యాక్సిస్ రహదారి, మంత్రులు, IAS అధికారుల బంగ్లాల పనులలో పురోగతిని సింగపూర్ ప్రతినిధులు పరిశీలించారు.

Similar News

News November 21, 2025

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కొడాలి, వల్లభనేని

image

ఉమ్మడి కృష్ణా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపున్న నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీరు కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో పాలిటిక్స్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా వీరిద్దరూ జగన్‌తో భేటీ కావడంపై వార్తల్లో నిలిచారు. కొడాలి, వంశీ తిరిగి యాక్టివ్ అవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మళ్లీ ప్రజలతో మమేకమవుతూ, పలు రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

News November 21, 2025

గోవింద కోటితో శ్రీవారి VIP బ్రేక్ దర్శనం

image

యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, సనాతన ధర్మంపై అనురక్తి కల్పించడమే లక్ష్యంగా TTD కీలక నిర్ణయం తీసుకుంది. రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు VIP దర్శనాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 1,00,01,116 సార్లు రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.

News November 21, 2025

NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

image

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.