News March 12, 2025
NTR: రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తుంది- కలెక్టర్

సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం జీఓఆర్టీ నం.9విడుదల చేసిందన్నారు.
Similar News
News March 13, 2025
NZB: UPDATE.. ACB సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం

NZB <<15734537>>రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న వైనాన్ని ఏసీబీ<<>> అధికారులు గుర్తించారు. బుధవారం సుదీర్ఘంగా జరిపిన సోదాల్లో ఏజెంట్ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
News March 13, 2025
నేడు సిరిసిల్ల కలెక్టరేట్లో జాబ్ మేళా

సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీ వైఎస్కే ఇన్ఫోటెక్లో ఉద్యోగాలు కల్పించడానికి నేడు కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నేడు ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 70935 14418, 90003 85863 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News March 13, 2025
ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.