News March 16, 2025

NTR: రేపటి నుంచే 10th ఎగ్జామ్స్ 

image

జిల్లాలో 10 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అరగంట ముందే అనుమతిస్తారని, మొబైల్ /ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. 

Similar News

News November 22, 2025

మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

image

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్‌లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్‌లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.

News November 22, 2025

HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

image

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.

News November 22, 2025

కొమురవెల్లి మల్లన్న కొత్త రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో నిర్మిస్తోన్న కొత్త రైల్వే స్టేషన్ పనులు 96% పూర్తయ్యాయి. త్వరలో ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి వేలాది మంది భక్తులు రోజూ మల్లన్న దర్శనానికి రావడంతో ఈ స్టేషన్ నిర్మాణం వారి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. కొత్త రైల్వే సౌకర్యంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గి, ప్రాంతీయ రవాణా మరింత మెరుగవుతుంది.