News March 16, 2025

NTR: రేపటి నుంచే 10th ఎగ్జామ్స్ 

image

జిల్లాలో 10 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అరగంట ముందే అనుమతిస్తారని, మొబైల్ /ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. 

Similar News

News October 22, 2025

వరంగల్ మార్కెట్ లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,000 ధర పలకింది. వండర్ హాట్(WH) మిర్చి రూ.16, 500, తేజా మిర్చి ధర రూ.14,400గా ఉంది. జాతీయ మార్కెట్‌లో మిర్చికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.

News October 22, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల జాబితా.!

image

అమరావతి-అమరేశ్వరస్వామి దేవాలయం.
కోటప్పకొండ-శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.
పెదకాకాని-శ్రీ మల్లేశ్వరస్వామి.
బాపట్ల-సోమనాథేశ్వరస్వామి ఆలయం.
చీరాల-శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం.
మాచర్ల-కాళహస్తేశ్వరస్వామి.
గురజాల-వీరేశ్వరస్వామి.
సత్తెనపల్లి-పాండురంగేశ్వరస్వామి.
చేబ్రోలు-చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి.
గోవాడ-శ్రీ బాల కోటేశ్వరస్వామి.
చిలుమూరు-శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయం.
గుంటూరు-సాంబశివాలయం.

News October 22, 2025

కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమీక్ష

image

TG: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.