News February 11, 2025
NTR: రైలు కిందపడి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257491291_1240-normal-WIFI.webp)
రైలు కిందపడి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన TSలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ తెలంగాణలోని మధిర రైల్వే స్టేషన్ పరిధిలో జైపూరు – చెన్నై ఎక్స్ప్రెస్ కిందపడ్డాడు. దీంతో అతని తల తెగిపోయింది. లోకో ఫైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293748869_893-normal-WIFI.webp)
1713: మొఘల్ చక్రవర్తి జహందర్ షా మరణం
1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
1809: అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
1962: సినీ నటుడు జగపతిబాబు జననం
1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం
News February 12, 2025
ఈరోజు నమాజ్ వేళలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738056116086_1226-normal-WIFI.webp)
✒ తేది: ఫిబ్రవరి 12, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 12, 2025
KNR: కెనాల్ కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంత్తు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739292918819_60382139-normal-WIFI.webp)
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.