News February 5, 2025

NTR: సదస్సుల ద్వారా 96% అర్జీలు పరిష్కరణ- కలెక్టర్

image

రెవెన్యూ సదస్సుల ద్వారా 96% అర్జీలను పరిష్కరించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 3,111 పిటిషన్‌లు రాగా 3,015 అర్జీలు పరిష్కారం పూర్తయిందన్నారు. అర్జీ అందుకున్నప్పుడే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి తగిన సూచనలు తెలియజేస్తున్నామన్నారు.

Similar News

News December 5, 2025

పాలమూరు: CM సొంతూరు ఉప సర్పంచ్ ఈయనే..!

image

వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నిక సమావేశానికి హాజరైన పదిమంది వార్డు మెంబర్లు వేమారెడ్డిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారి జంగయ్య ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. వేమారెడ్డి ఉపసర్పంచ్ కావడం మూడోసారి. ఇటీవల సర్పంచ్‌గా వెంకటయ్యను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.

News December 5, 2025

నర్సంపేట: భారీ పోలీస్ బందోబస్తు నడుమ CM పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు నర్సంపేటకు రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 575 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో డీసీపీలతో పాటు, ఏసీపీలు, సీఐలు, ఎస్సై, ఆర్ఐ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్, ట్రాఫిక్ పోలీసులు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డ్స్ ఉన్నారు.

News December 5, 2025

రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

image

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.