News February 5, 2025
NTR: సదస్సుల ద్వారా 96% అర్జీలు పరిష్కరణ- కలెక్టర్

రెవెన్యూ సదస్సుల ద్వారా 96% అర్జీలను పరిష్కరించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 3,111 పిటిషన్లు రాగా 3,015 అర్జీలు పరిష్కారం పూర్తయిందన్నారు. అర్జీ అందుకున్నప్పుడే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా మాట్లాడి తగిన సూచనలు తెలియజేస్తున్నామన్నారు.
Similar News
News March 9, 2026
కొత్త బురుజులో సీఎం చంద్రబాబు ప్రజా సభ

డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తొలుత రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
News March 9, 2026
విశాఖ భీమిలి బీచ్ రోడ్లో విరాగో రిసార్ట్ సీజ్..!

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
News March 9, 2026
ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.


