News April 12, 2026

NTR: అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ.. బ్రేక్ దర్శనాల రద్దు

image

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరగడంతో దుర్గమ్మ అంతరాలయ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆదివారం కావడంతో భక్తులు తరలిరావడంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్రేక్ దర్శనాలను నిలిపివేశారు. ఎండ తీవ్రతకు భక్తులు అల్లాడుతుండగా, దాతల సాయంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న మజ్జిగ ప్యాకెట్లు సరిపోవడం లేదని, రోజుకు 10వేల ప్యాకెట్లు, ORS అందజేయాలని భక్తులు కోరుతున్నారు.

Similar News

News April 14, 2026

ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్‌లో 331 మంది చిన్నారులకు HIV!

image

పాకిస్థాన్‌లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్‌లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.

News April 14, 2026

సీఎం పదవికి నితీశ్ రాజీనామా

image

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్‌కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

News April 14, 2026

వికారాబాద్: రూ.500కే 50 కిలోల బస్తా..!

image

ఉల్లి రైతులకు జిల్లాలో కన్నీళ్లే మిగులుతున్నాయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేంలేక VKB పట్టణంలోని ప్రధాన రోడ్లపైకి ట్రాక్టర్లతో ఉల్లిని తెచ్చి విక్రయిస్తున్నారు. 50కిలోల బస్తాను రూ.500కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు.