News February 26, 2025

NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

image

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.

Similar News

News February 26, 2025

నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్

image

2024-25 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. క్వార్టర్స్‌లో ఒకటి, సెమీస్‌లో 2 రన్స్ ఫస్ట్ ING లీడ్‌తో అనూహ్యంగా తొలిసారి ఫైనల్ చేరిన కేరళ, 2సార్లు టైటిల్ విన్నర్ విదర్భ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. అక్షయ్ వాడ్కర్(C), కరుణ్ నాయర్‌, మాలేవర్‌లతో విదర్భ బ్యాటింగ్ బలంగా ఉంది. అటు, సచిన్ బేబీ నేతృత్వంలోని కేరళ బ్యాటర్లు నిజార్, అజహరుద్దీన్, బౌలర్ జలజ్ సక్సేనాలపై ఆశలు పెట్టుకుంది.

News February 26, 2025

గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పదేళ్లు జైలుశిక్ష..!

image

యువతిని మోసగించి గర్భవతిని చేశాడనే అభియోగంపై నమోదు చేసిన కేసులో నిందితునికి పదేళ్లు జైలు శిక్ష రూ.5 వేలు జరిమానా విధించినట్లు అడ్డతీగల సీఐ నరసింహుమూర్తి తెలిపారు. పాత రామవరం గ్రామానికి చెందిన యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసగించాడు. విచారణలో నేరారోపణ రుజువు కావడంతో రాజమహేంద్రవరం ఎనిమిదవ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు.

News February 26, 2025

KMR:18,469 మంది విద్యార్థులు.. 38 సెంటర్లు..

image

ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న వేళ.. అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో ఉన్నారు. KMR జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం 18,469 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం 38 పరీక్ష కేంద్రాలను, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 గురు సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం తెలిపారు.

error: Content is protected !!