News December 21, 2025
NTR జిల్లాలో త్వరలో ‘ఆంధ్రా టాక్సీ’ సేవలు

ప్రైవేట్ క్యాబ్ సంస్థల అధిక ఛార్జీల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ‘ఆంధ్రా టాక్సీ’ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. సామాన్యులకు తక్కువ ధరకే ఆటో, టాక్సీ సేవలు అందించడమే లక్ష్యంగా NTR జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించనున్నారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో నడిచే ఈ యాప్ వల్ల పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రవాణా సులభతరం కానుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Similar News
News December 22, 2025
నేడు ప్రజా అర్జీలు స్వీకరించనున్న బాపట్ల కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే PGRSకు జిల్లాస్థాయి అధికారులు అందరూ హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు PGRS అర్జీలపై జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. ప్రతి డివిజన్, మండల రెవెన్యూ కార్యాలయాలలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 22, 2025
నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News December 22, 2025
యోగాతో ఒత్తిడి, మానసిక సమస్యలకు చెక్

యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.


