News December 16, 2025

NTR: న్యూ ఇయర్ కానుకగా ‘ఆంధ్ర టాక్సీ యాప్’

image

ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం కమిషన్ లేకుండా ‘ఆంధ్ర టాక్సీ’ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓలా, రాపిడోలో 30% వరకు కమిషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఉపశమనం కలిగించనుంది. ఈ యాప్‌ను మొదట ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద జనవరి 1న ప్రారంభించనున్నారు. దీనిని పర్యాటక ప్రాంతాలకు అనుసంధానించి ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నారు. రేపటి నుంచి డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు.

Similar News

News December 20, 2025

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

image

TG: భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా ఫైల్‌పై సంతకం పెట్టాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఫైళ్ల పెండింగ్‌పై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

News December 20, 2025

పేరెంట్స్ మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో!

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్యకుమార్ సూచించారు. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్‌లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్‌లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.

News December 20, 2025

సంగారెడ్డి: జిల్లాలో PACS ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాల రద్దు

image

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేసింది. వీరి పదవీకాలం ఆగష్టు 14వ తేదీతో ముగిసినట్లు ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం తొమ్మిది జిల్లాల డీసీసీబీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ఈ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది.