News October 28, 2025
NTR: బాలికపై దారుణం.. నలుగురు కలిసి.!

15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన NTR జిల్లా చందర్లపాడు(M)లో జరిగింది. చిన్న పిల్లలతో ఆడుకుంటున్న బాలికకు నలుగురు వ్యక్తులు జామకాయల ఆశ చూపి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జామకాయల్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ధర్మరాజు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News October 28, 2025
ములుగు జిల్లాకు భారీ వర్ష సూచన

ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురుగాలు కూడా విస్తాయని పేర్కొంది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శిథిలావస్థ ఇళ్లు, లోతుట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
News October 28, 2025
తుఫాను ప్రభావం.. భీకర గాలులు

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.
News October 28, 2025
పూజ గదిలో ఈ విగ్రహాలు ఉండకూడదు: పండితులు

పూజ గదిలో శనిదేవుడు, రాహువు, కేతువుల ఫొటోలు/విగ్రహాలు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ‘ఉగ్ర రూపాలైన కాలభైరవ, మహంకాళి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టడం శుభకరం కాదు. పూజ గదిలో తినకపోవడం, నిద్రించకపోవడం ఉత్తమం. తడి జుట్టుతో ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు’ అంటున్నారు. ✍️ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.


