News March 21, 2025

NTR: మిషన్ వాత్సల్యపై జిల్లా స్థాయి సమీక్ష

image

కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య – శిశు సంక్షేమ, రక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, జిల్లాలో వాటి అమలు పురోగతిపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాల అమలు, కుటుంబ ఆధారిత సంరక్షణ, ఆర్థిక సహకారం, బాలల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కమిటీలు ప్రతి 15 రోజులకు సమావేశం కావాలన్నారు. 

Similar News

News March 28, 2025

అగ్నివీర్‌కు ఎంపికైన నర్సాపూర్ (జి) వాసి

image

నర్సాపూర్ (జి) మండలంలోని అర్లి(కే) గ్రామానికి చెందిన పోసాని -రాములు దంపతుల కుమారుడు రాజశేఖర్ ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్‌కు ఎంపికయ్యాడు. తల్లి బీడీ కార్మికురాలు కాగా తండ్రి వ్యవసాయం చేస్తూ చదివించారు. చిన్ననాటి నుంచి దేశ సేవ చేయాలనే సంకల్పంతో అగ్ని వీర్‌కు ప్రయత్నించి విజయం సాధించానని యువకుడు రాజశేఖర్ తెలిపారు. ఆయన్ను గ్రామస్థులతో పాటు మండల వాసులు అభినందించారు.

News March 28, 2025

VKB: గ్రేట్.. ఆర్మీకి సెలెక్ట్ 

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లికి చెందిన జంగం యాదయ్య కుమారుడు జంగం గణేష్, మెరుగు శ్రీశైలం కుమారుడు మెరుగు అఖిల్, ఎల్లయ్య కుమారుడు పినేమోని అభిలాశ్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వారివి పేద కుటుంబాలు కాగా పేరెంట్స్ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆ కష్టాలు చూస్తూ పెరిగిన ముగ్గురు యువకులు సత్తా చాటారు. అగ్నీవీరులుగా ఎంపికయ్యారు. 

News March 28, 2025

SHOCKING: కూతురిని ప్రేమించాడని..

image

TG: రాష్ట్రంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోటలో సాయికుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. కూతురును ప్రేమించొద్దని హెచ్చరించినా వినలేదని నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

error: Content is protected !!