News March 19, 2024

NTR: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ రద్దు చేస్తున్నట్లు, రైల్వే వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.

Similar News

News July 3, 2024

మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం

image

పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్‌ సోమవారం 43 మందికి పింఛన్‌లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.

News July 3, 2024

విజయవాడ: దేవదాయశాఖ అధికారిణి సస్పెండ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.

News July 2, 2024

విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ

image

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.