News November 18, 2025

NTR వీరాభిమాని ఆగయ్యకు నేతల నివాళులు

image

TDP సీనియర్ నేత, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో PDPL MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్‌లో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. TDP ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతగా ఆగయ్య పార్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని, ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారని నేతలు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Similar News

News November 18, 2025

కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

image

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

News November 18, 2025

కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

image

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

News November 18, 2025

TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

image

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్‌లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.