News September 9, 2024

ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా

image

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ చోటకు చేరారు. ‘దేవర’ సినిమా ట్రైలర్ ఈవెంట్ రేపు ముంబైలో జరగనుండగా అక్కడ వీరిద్దరూ కలిసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ట్రైలర్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు సందీప్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు వీరి ఫొటోను షేర్ చేస్తున్నారు.

Similar News

News December 23, 2025

3నెలల్లో భాగ్యలతలో FOB: మంత్రి కోమటిరెడ్డి

image

NH65పై మృత్యుఘోషకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. భాగ్యలత వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB)ని 3నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హయత్‌నగర్ వద్ద యజమానుల మొండితనం, కోర్టు స్టేతో రోడ్డు విస్తరణకు లేట్ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం.. బందోబస్తు మధ్య పనులు పూర్తి చేయండి’ అని అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు Way2Newsతో తెలిపారు.

News December 23, 2025

‘జాతీయ రైతు దినోత్స‌వం’ వెనుక కథ ఇదే..

image

రైతు కుటుంబంలో పుట్టి తన చివరి క్షణం వరకు అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి మాజీ ప్రధాని ‘చౌదరి చరణ్ సింగ్’. ఆయన కృషి, పోరాటం వల్ల ‘జమీందారీ చట్టం’ రద్దై ‘కౌలుదారీ చట్టం’ అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలిచ్చే విధానం వచ్చింది. అందుకే చరణ్ సింగ్‌ను ‘రైతు బంధు’గా పిలుస్తారు. రైతులకు చేసిన సేవ‌ల‌కు గుర్తుగా చరణ్ సింగ్ పుట్టినరోజైన DEC-23ను ‘జాతీయ రైతు దినోత్స‌వం’గా జ‌రుపుకుంటున్నారు.

News December 23, 2025

హిందూ మహిళలతోనూ అలానే చేయగలరా?: జావేద్ అక్తర్

image

బిహార్ CM నితీశ్ కుమార్ మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగడం<<>> విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ‘నితీశ్ చేసిన పని అసభ్యకరంగా ఉంది. ఇతరులను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ఏరియాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా ఘూంఘట్ (దుపట్టా, చీరకొంగు) కప్పుకుంటారు. వాటినీ లాగుతారా?’ అని ప్రశ్నించారు.