News September 27, 2024
రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్: SS కార్తికేయ

రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని జక్కన్న కుమారుడు SS కార్తికేయ పేర్కొన్నారు. ‘23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే మొదలైందో ఆయనతోనే ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. NTRను దగ్గరి నుంచి చూస్తూ పెరగడం, ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన బహుమతి ఇది’ అని తెలిపారు.
Similar News
News December 28, 2025
జనవరి 3న కొండగట్టుకు పవన్

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో <<18636046>>టీటీడీ రూ.35.19 కోట్లతో<<>> నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల వసతి కోసం 100 గదులతో భారీ సత్రాన్ని నిర్మించనున్నారు.
News December 28, 2025
ఏడవ నేర్చిన వ్యవసాయము

ఒక పనిని ఇష్టం లేకుండా, అయిష్టంగా లేదా ఏడుస్తూ చేస్తే అది ఎప్పటికీ విజయవంతం కాదు. వ్యవసాయం వంటి శ్రమతో కూడిన పనులను ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో చేయాలి. అలా కాకుండా “ఏడుస్తూ” లేదా అయిష్టంగా చేస్తే, ఆ పంట సరిగా పండదు, పైగా అది నష్టాలకే దారితీస్తుంది. ఎవరైనా ఒక పనిని అయిష్టంగా చేస్తే దాని వల్ల ప్రయోజనం లేదని తెలిపే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 28, 2025
TG: ఈ ఆలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి వేడుకలు భద్రాచలంతో పాటు యాదగిరిగుట్ట, ధర్మపురి, హైదరాబాద్ TTD క్షేత్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. స్వర్ణగిరి వేంకటేశ్వర, చిలుకూరు బాలాజీ ఆలయాల్లో గతంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించారు. శివాలయమే అయినా అనంత పద్మనాభ స్వామి కొలువైనందుకు వేములవాడలోనూ ఉత్తర ద్వార దర్శనాలుంటాయి. స్థానిక వైష్ణవాలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.


