News October 7, 2025
NTR DMHOకి అవార్డు

ఎన్టీఆర్ జిల్లాలో పలు ఆసుపత్రులను స్వచ్ఛ ఆసుపత్రులుగా తీర్చిదిద్దినందుకు DMHO సుహాసిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విజయవాడ హెచ్బీ కాలనీ యూపీహెచ్సీ, అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డులు లభించాయని ఆమె తెలిపారు. కలెక్టర్ సూచనలతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని DMHO పేర్కొన్నారు.
Similar News
News March 27, 2026
నేటి నుంచి విజయవాడలో ఐజేయూ జాతీయ ప్లీనరీ

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ జాతీయ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెుల 27, 28, 29న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ సదస్సు జరగనుంది. 27 రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28న సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ఈ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. జర్నలిస్టుల హక్కుల గురించి ఈ ప్లీనరీలో ప్రధానంగా చర్చించనున్నారు.
News March 27, 2026
IPL 2026 ఓపెనింగ్ సెరిమనీ రద్దు!

ఈ ఏడాది IPL ఓపెనింగ్ సెరిమనీ ఉండదు. గతేడాది జూన్ 4న బెంగళూరు స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈసారి వేడుకలు నిర్వహించొద్దని BCCI నిర్ణయించింది. అందుకే శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్ ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయట్లేదు. అయితే మే 31న జరిగే ఫైనల్ రోజు మాత్రం గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ ప్లాన్ చేస్తున్నారు.
News March 27, 2026
పెద్దపల్లి: మే 11 నుంచి జనగణన 2027 ప్రారంభం: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జనగణన 2027 హౌస్ లిస్టింగ్ సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా నిజమైన సమాచారం అందించాలని, తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. సిబ్బందికి డేటా సేకరణ, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. జనగణన మే 11 నుంచి ప్రారంభమై భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఖచ్చిత గణాంకాలు సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.


