News February 26, 2025

NTR: ఎమ్మెల్సీ పదవి రేసులో విజయవాడ కీలక నేత..?

image

2025 మార్చిలోపు రాష్ట్రంలోని అయిదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఈ సారి విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో రాధకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది.

Similar News

News February 26, 2025

రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్?

image

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను లుధియానా వెస్ట్ అసెంబ్లీ నుంచి బరిలోకి దించారు. దీంతో ఎంపీ స్థానం ఖాళీ కావడంతో కేజ్రీవాల్ దాన్ని భర్తీ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.

News February 26, 2025

హాలీం వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం

image

రంజాన్ పర్వదినాలలో భాగంగా హలీం విక్రయదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్టిజోన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ సర్కిళ్లకు చెందిన హలీం విక్రయదారులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి హలీం తయారీలో తీసుకోవాల్సిన పరిశుభ్రత చర్యలు, వాటిని సజావుగా పంపిణీ చేయటంపై పలు అంశాలను వ్యాపారులకు సూచించారు.

News February 26, 2025

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవే

image

1.సోమనాథ్ (గుజరాత్) , 2.మల్లికార్జున (శ్రీశైలం), 3.మహాకాళ ( మధ్యప్రదేశ్) ,4. ఓంకారేశ్వర (మధ్యప్రదేశ్), 5.వైద్యనాథ్ (ఝార్ఖండ్), 6.భీమశంకర (మహారాష్ట్ర), 7. రామేశ్వరం (తమిళనాడు), 8.నాగేశ్వర (గుజరాత్),9. విశ్వేశ్వర (ఉత్తరప్రదేశ్), 10.త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర),11. కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) 12. ఘృష్ణేశ్వరం (మహారాష్ట్ర)

error: Content is protected !!