News February 18, 2025

NTR: గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

మైలవరం, జగ్గయ్యపేటలోని జ్యోతిబాఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాదిలో 5వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశపరీక్ష నిర్వహించి మైలవరంలో 80, జగ్గయ్యపేటలో 40 సీట్లు భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 15 లోపు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు సూచించారు.

Similar News

News December 24, 2025

సీఎంలు చంద్రబాబు, రేవంత్ క్రిస్మస్ విషెస్

image

ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని CBN అన్నారు. ఏసు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అటు BRS చీఫ్ కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

News December 24, 2025

తిరుపతి: 7 గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దనుకుని..!

image

అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వాటికి సంతృప్తి చెందక SIగా సెటిలయ్యారు. 2022లో B.Tech పాసయ్యాడు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ హవల్దారుగా ఉద్యోగం సాధించారు. 2023లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూ.అసిస్టెంట్‌గా కొంతకాలం పనిచేశారు. ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో అహర్నిశలు కష్టపడి పీఎస్ఐగా ట్రైనింగ్ పూర్తి చేసి తిరుపతి జిల్లా భాకరాపేట SIగా చేరారు.

News December 24, 2025

హైదరాబాద్‌కు ‘డబుల్’ పవర్?

image

HYD పాలనలో పెను మార్పులకు సర్కార్ స్కెచ్ వేస్తోంది. అడ్మినిస్ట్రేషన్‌ను రెండు భాగాలుగా చీల్చి, పర్యవేక్షణను పక్కాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఓఆర్‌ఆర్‌ లోపల GHMC మొత్తాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి అప్పగించి, ఆయనే కమిషనర్‌గానూ వ్యవహరించేలా భారీ ప్లాన్ సిద్ధమవుతోంది. ఓఆర్‌ఆర్‌ అవతల శరవేగంగా వెలుస్తున్న మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను మరొక ఉన్నతాధికారికి అప్పగించనున్నారు.