News March 21, 2025

NTR: మిషన్ వాత్సల్యపై జిల్లా స్థాయి సమీక్ష

image

కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య – శిశు సంక్షేమ, రక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, జిల్లాలో వాటి అమలు పురోగతిపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాల అమలు, కుటుంబ ఆధారిత సంరక్షణ, ఆర్థిక సహకారం, బాలల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కమిటీలు ప్రతి 15 రోజులకు సమావేశం కావాలన్నారు. 

Similar News

News March 31, 2025

గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. 

News March 31, 2025

మంచిర్యాల: సుమంత్‌ గౌడ్‌కి గ్రూప్‌-1లో STATE RANK

image

గ్రూప్‌-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాడు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన సుమంత్ గౌడ్. కాగా, ఈయన గ్రూప్-2, 3, 4లో కూడా ర్యాంకు సాధించాడు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో రాష్ట్రస్థాయిలో 286వ ర్యాంకు, మల్టీజోన్‌లో 126వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సుమంత్ గౌడ్ GHMCలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

News March 31, 2025

చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

image

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

error: Content is protected !!