News February 12, 2025
మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గింది: కేంద్రం

గత ఆరేళ్లలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 38కి తగ్గిందని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. నేషనల్ పాలసీ&యాక్షన్ ప్లాన్-2015 అమలు చేసినప్పటి నుంచి LWE ప్రభావిత ప్రాంతాల్లో 4,000kmsకి పైగా రోడ్లు నిర్మించామని తెలిపింది. కనెక్టివిటీని మెరుగుపరచడానికి 1,300కి పైగా టెలికాం టవర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో LWE ప్రభావిత రాష్ట్రాలకు ₹1,925.83crs విడుదల చేశామని వివరించింది.
Similar News
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 6, 2025
భక్తికి ప్రతీక ‘తిరుమలనంబి ఆలయం’

తిరుమలనంబి శ్రీవారికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తిరుమలకు వచ్చిన మొదటి భక్తుడు. ఆయన భగవద్రామానుజులకు అలిపిరిలో రామాయణ రహస్యాలను బోధించారు. అందుకే, శ్రీవారి ఊరేగింపు సమయంలో, దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయం వద్ద స్వామివారు ఆగి, హారతిని స్వీకరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ ఆలయం ఆయన గొప్ప భక్తికి, శ్రీవారిపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. <<-se>>#VINAROBHAGYAMU<<>>


