News February 17, 2025

NZBలో అమ్మవారి ముక్కపుడక చోరీ

image

నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గొల్లగుట్ట తాండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం తాళాలు పగులకొట్టిన దొంగలు అమ్మవారి బంగారు ముక్కు పుడక ఎత్తుకెళ్లారు. ఈ మేరకు గ్రామస్థులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News January 8, 2026

ED రైడ్స్.. ప్రతీక్ ఇంటికి CM మమత

image

IPAC కోఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి TMCకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను ED స్వాధీనం చేసుకుందని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని ప్రతీక్ ఇంటిపై ED <<18796717>>దాడులు<<>> చేసింది. దీంతో మమత ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంలో ఈ కామెంట్లు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల వివరాలు ఉన్న ఫైల్స్‌ను ఈడీ అధికారులు తీసుకెళ్లారని మండిపడ్డారు.

News January 8, 2026

సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. HYDలో ఎక్కడినుంచి అంటే?

image

సంక్రాంతి పండుగ సందర్భంగా రేపటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు ఎప్పటిలాగే JBS, MGBSకు పోటెత్తకుండా ప్రధాన కూడళ్ల నుంచి నడపాలని నిర్ణయించింది. సిటీలో ఎంజీబీఎస్, జేబీఎస్, గచ్చిబౌలి, ఉప్పల్, బోయిన్‌పల్లి, ఆరాంఘర్, KPHB, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

News January 8, 2026

కృష్ణా జలాలపై BRS, కాంగ్రెస్‌ది పొలిటికల్ డ్రామా: బండి సంజయ్

image

TG: కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు KCR అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆయన్ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమాలు చేసి KCR మెడలు వంచింది BJPనే అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, BRS లోపాయికారీ ఒప్పందంతో పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండొద్దని కేంద్రం కోరుకుంటోందన్నారు.